Share News

తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - May 24 , 2026 | 09:55 AM

తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
Tenali Women Case

గుంటూరు జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వీడియోలో పోలీసులపై పలు ఆరోపణలు చేసింది. ఓ కేసు విషయంలో తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని వీడియోలో ఆరోపించింది. తాను చేయని నేరంలో ఇరికించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


కొంతకాలం క్రితం కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భర్తతో కలిసి వాచ్‌ ఉమన్‌గా పనిచేసిన తిరుపతమ్మపై, అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఆరోపణలు తప్పుడు‌వని, తనపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 10:01 AM