పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. భారీగా వెండి ఆభరణాల అపహరణ
ABN , Publish Date - May 08 , 2026 | 11:04 AM
పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
పల్నాడు జిల్లా, మే 8 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ మొత్తంలో వెండి ఆభరణాలను అపహరించారు. ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాళాలు పగలకొట్టి చోరీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు (గురువారం) ఉదయం షాపు యజమాని దుకాణానికి వచ్చేసరికి తాళాలు పగలకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుకాణంలో పరిశీలించగా వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించారు. దొంగలు సుమారు 2 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. అపహరించిన ఆభరణాల విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చోరీకి పాల్పడిన వారు ముందస్తు ప్రణాళికతో వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల్లో ఆందోళన..
పల్నాడు జిల్లాలో వరుస చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ మరింత పెంచాలని కోరుతున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు
పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News