మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:00 AM
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక చంద్రయాన్-3 చంద్రునిపై ల్యాండింగ్, ఆదిత్య-ఎల్1 సూర్య అన్వేషణ, అలాగే అంతరిక్షంలో భారతదేశ భవిష్యత్తుకు కొత్త అవకాశాలను తెరుస్తున్న అద్భుతమైన స్పాడెక్స్ డాకింగ్ ప్రదర్శనల వరకు, ఇస్రో, మన శాస్త్రవేత్తల అసాధారణ విజయాలను మనం వేడుక చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో, భారతదేశ అంతరిక్ష రంగం ఓ నూతన శకంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు.
సంస్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం పెంపు, IN-SPACe వంటి సంస్థలు మన జాతీయ అంతరిక్ష ఆశయాలకు దోహదపడేందుకు స్టార్టప్లు, పరిశ్రమలు, పరిశోధకులు, యువ ఆవిష్కర్తల కోసం ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర దిశగా గగన్యాన్ పయనిస్తోందని వెల్లడించారు. మన దీర్ఘకాలిక స్పేస్ విజన్ 2047లో భాగంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ రూపుదిద్దుకుంటుండగా, రాబోయే ప్రయాణం మరింత స్ఫూర్తిదాయకంగా ఉందని వివరించారు. భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్న ప్రతి శాస్త్రవేత్తకు, ఇంజినీర్కు, సాంకేతిక నిపుణుడికి, యువ మేధావులకు వందనాలు పవన్ కల్యాణ్ తెలిపారు.
వార్తలు కూడా చదవండి...
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News