Share News

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం

ABN , Publish Date - Aug 22 , 2026 | 08:19 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 20 వేల హెక్టార్లలో 2 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను అధికారులు వెదజల్లారు. ఈ మేరకు 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు పడింది.


అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో డ్రోన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో విస్తృతంగా ఈ‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలని లక్ష్యంగా అధికారులు తీసుకున్నారు. సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియ సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరినీ పవన్ కల్యాణ్ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:05 PM