బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు ఊరట
ABN , Publish Date - Apr 30 , 2026 | 07:02 PM
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు (Raghu Rama Krishnaraju) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు (A-2) బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు వ్యక్తిగతంగా రఘురామ ఈరోజు (గురువారం) హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో అరెస్ట్ చేయొద్దని ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. రూ. 50,000 షురిటీ బాండ్పై బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా ఊరట లభించింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సుమారు 15 వేల పేజీలకు పైగా ఉండటంతో, ఆ పత్రాల పరిశీలనకు నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరారు. పత్రాల పరిశీలన (Scrutiny) కోసం తదుపరి విచారణను జులై 6, 2026కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కంపెనీల లిక్విడేషన్ స్థితిగతులను తెలపాలని సంబంధిత అధికారులను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..
పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News