Share News

కోనసీమ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

ABN , Publish Date - Sep 06 , 2026 | 04:23 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం శివారు కొత్త కాలనీలో భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి, భర్త కర్రి నాగేశ్వరరెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కోనసీమ జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
Ambedkar Konaseema District Tragedy

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రావులపాలెం శివారు కొత్త కాలనీలో భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి(42), భర్త కర్రి నాగేశ్వరరెడ్డి(49)లు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలో కొంతకాలంగా ఈ దంపతులు చీటి పాటలు నిర్వహిస్తున్నారు. వీరు తనకు రూ.15 లక్షలు బాకీ ఇవ్వటం లేదంటూ కొప్పిశెట్టి నాగ మల్లేశ్వరి అనే మహిళ గత ఆగస్టు 31వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డారు.


ఈ ఆరోపణలతో దంపతులు కర్రి దుర్గాలక్ష్మి, భర్త కర్రి నాగేశ్వరరెడ్డి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ మహిళకు తాము రూ.కోటి అప్పు ఇచ్చామని తిరిగి చెల్లించడం లేదనే కారణంతో తాము ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సూసైడ్ నోట్‌లో దంపతులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా గురువు చేతిలో నేనూ దెబ్బలు తిన్నాను: సీఎం చంద్రబాబు

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

గోదావరి కాలుష్యానికి కారణమైన ఏపీ పేపర్ మిల్‌‌పై ఉద్యమిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 04:37 PM