తిరుపతిలో నవ దంపతులపై దాడి.. అసలు ఏం జరిగిందంటే..?
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:19 AM
తిరుపతిలో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.
తిరుపతి, జులై 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. రక్షణ కోసం తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. యువతి మెడలోని తాళిబొట్టును తెంచి యువకుడిపై పెళ్లి కుమార్తె వర్గీయులు దాడి చేశారు. భయంతో ఓ కార్యాలయంలోకి నవ దంపతులు వెళ్లారు. స్థానికుల సహాయంతో ఇరువురిని ఎస్వీ యూనివర్శిటీ పోలీసుల చెంతకు ఓ మహిళా చేర్చారు.
అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, కేకల దొడ్డిపల్లికి చెందిన శివ స్నేహ, సూళ్లూరుపేట మండలం, మతిమూడి గ్రామానికి చెందిన చందులకు ఓ కోచింగ్ సెంటర్ వద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరువురి పరిచయం ప్రేమగా మారి ఈనెల 19వ తేదీన ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే శివస్నేహ కనపడట్లేదని రాయచోటి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాయిచోటి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడి తల్లి మునిలక్ష్మిని, పెద్దమ్మ అచ్చమ్మతోపాటు మేనమామ ముని చంద్రాలను రాయచోటి పోలీసులు మూడు రోజుల క్రితం తీసుకెళ్లినట్లుగా చందు చెబుతున్నాడు.
ఈ విషయమై తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తాము వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లుగా నవ దంపతులు చెబుతున్నారు. ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు నవ వధువు వద్ద స్టేట్మెంట్ తీసుకుని రాయిచోటి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం రాయచోటీ పోలీసులు నవదంపతులను రాయచోటికి తీసుకెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News