Share News

Mahindra University Clarity in Narcotics Case: నార్కోటిక్స్ కేసులో మహీంద్రా యూనివర్సిటీ క్లారిటీ..

ABN , Publish Date - Aug 27 , 2025 | 09:57 PM

మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Mahindra University Clarity in Narcotics Case: నార్కోటిక్స్ కేసులో మహీంద్రా యూనివర్సిటీ క్లారిటీ..
Mahindra University Clarity in Narcotics Case

హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మహీంద్రా యూనివర్సిటీలో (Mahindra University) తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.యాజులు మేడూరి (Vice Chancellor Yajulu Meduri) స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన నార్కోటిక్స్ కేసులో (Narcotics Case) తమ యూనివర్సిటీ విద్యార్థుల ప్రమేయం ఉందని వెలువడిన పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మత్తుపదార్థాల వినియోగం, కలిగి ఉండటం, పంపిణీ చేయడాన్ని విశ్వవిద్యాలయం ఖండిస్తోందని పేర్కొన్నారు యాజులు మేడూరి.


మహీంద్రా యూనివర్సిటీ జీరో టాలరెన్స్ పాలసీను అనుసరిస్తోందని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే లేదా తమ విద్యార్థి సమాజం భద్రత, సంక్షేమాన్ని ప్రమాదంలోకి నెట్టే ఏ చర్యకైనా విశ్వవిద్యాలయ నియమావళి, వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు యాజులు మేడూరి.


ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు తాము పూర్తిగా సహకరించామని, సమస్య వేగంగా, సముచితంగా పరిష్కారమయ్యేలా అన్ని విధాలా సహాయాన్ని అందించామని గుర్తు చేశారు. తమ సంస్థ విలువలు, సమగ్రతను కాపాడటానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటూ సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు యాజులు మేడూరి.


ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందగల సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి తాము అంకితభావంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉన్నత విద్యాసంస్థగా మత్తుపదార్థాల వినియోగం, చట్టపాలన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తమ విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని నొక్కిచెప్పారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుని మహీంద్రా యూనివర్సిటీ ప్రతిపాదించే విలువలను కాపాడాలని తాము కోరుకుంటున్నామని మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యాజులు మేడూరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 10:17 PM