CM Revanth Reddy: జవాన్ మురళి నాయక్ మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 09 , 2025 | 07:29 PM
CM Revanth Reddy: భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు జవన్ మురళి నాయక్ అమరులయ్యారు. జవాన్ మురళి నాయక్ మృతి పట్ల సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందారు. జవాన్ మృతిపై పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్మీకి మురళి నాయక్ చేసిన సేవలను కొనియాడుతున్నారు. మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. జవాన్ మురళి నాయక్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మురళి నాయక్ వీర మరణం పొందడం దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
మురళి నాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: బండి సంజయ్
పాకిస్తాన్తో పోరాటంలో జవాన్ మురళి నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి నాయక్ వీరమరణాన్ని యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుందని బండి సంజయ్ తెలిపారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు. మురళి నాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. మురళి నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్తో ఫోన్లో మాట్లాడి బండి సంజయ్ ఓదార్చారు. మురళి నాయక్ తండ్రితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా.. భారతదేశం పాకిస్తాన్ దేశాల మధ్య జరుగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలుగు జవన్ మురళి నాయక్ అమరులయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ గత కొన్నేళ్లుగా భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న(గురువారం) రాత్రి యుద్ధభూమిలో జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న జవన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే రేపు (శనివారం) జవన్ మురళి నాయక్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మురళి నాయక్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read:
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News