Share News

SIT Petition On ACB court: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్

ABN , Publish Date - Oct 08 , 2025 | 09:18 AM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. వీరి బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది.

SIT Petition On ACB court: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్
SIT Petition On ACB court

విజయవాడ, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు (AP Liquor Scam Case)లో నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. వీరి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court)లో విచారణ జరుగనుంది. ఈ నేపథ్యంలో నిందితులకి న్యాయస్థానం బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్ దాఖలు చేసింది.


ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినిపిస్తామని ఏసీబీ కోర్టులో నిన్న(మంగళవారం) పిటిషన్ దాఖలు చేసింది సిట్. ఇవాళ(బుధవారం) సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయం తీసుకోనుంది ఏసీబీ కోర్టు. ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌పై వేర్వేరుగా మరోసారి వాదనలు వినిపిస్తామని సిట్ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 12:29 PM