Home » AP Liquor
లిక్కర్ స్కామ్ ద్వారా సుమారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే పలువురు నిందితులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
వైసీపీ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావును సిట్ అధికారులు శనివారం హైదరాబాద్లో విచారించారు. నాలుగు గంటల పాటు కారుమూరిని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కారుమూరిని ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు విచారించారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఐఏఎస్ మాజీ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయా విభాగాలకు సిట్ లేఖలు రాసింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అవినాశ్ ఏ-7గా ఉన్నారు.
ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ అనంతరం బయటకు వచ్చిన మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి.. ఏబీఎన్ మైక్ను చూసి పరుగులు పెట్టారు. ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు కృష్ణమోహన్ రెడ్డి నీళ్లు నమిలారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.