Home » AP Liquor
ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బీచ్ షాక్స్’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ - 362 ప్రకారం, ఎంపిక చేసిన బీచ్లలో పరిమిత నిబంధనలతో ఈ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కాం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు.
మద్యపాన నిషేధం చేస్తామని మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని గత వైసీపీ ప్రభుత్వంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణంలో రూ.3500 కోట్లు దోచుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్లో గురువారం పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అసత్య ఆరోపణలతో జగన్ మీడియా ముందుకు వచ్చారని ధ్వజమెత్తారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కేఎన్ఆర్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందనే ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు గురిపెట్టారు.