Share News

BTech Ravi: నీ రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది.. జగన్‌పై బీటెక్ రవి ధ్వజం

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:32 PM

పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్‌ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డినేనని.. రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.

BTech Ravi: నీ రప్పా రప్పా బ్యాచ్ ఏమైంది.. జగన్‌పై బీటెక్ రవి ధ్వజం
BTech Ravi

కడప,ఆగస్టు14 (ఆంధ్రజ్యోతి): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC Bye Election) తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Latha Reddy) ఘనవిజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) (BTech Ravi) స్పదించారు. జగన్‌కు 11 సీట్లు వచ్చాయని.. ఒంటిమిట్ట, పులివెందులలో కూడా 11 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేశారని తెలిపారు. గత 30 ఏళ్లుగా పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదని గుర్తుచేశారు బీటెక్ రవి.


పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని బీటెక్ రవి విమర్శించారు. కార్యకర్తలు జగన్‌ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎక్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డినేనని.. రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని ఉద్ఘాటించారు. దమ్ముంటే పెద్దిరెడ్డిని పులివెందుల ఉప ఎన్నికకు పంపాల్సిందని ఎద్దేవా చేశారు. జగన్ మాట మాట్లాడితే గంగమ్మ జాతర, రప్పా రప్పా అంటున్నారని... పులివెందుల ఉప ఎన్నికలో రప్పా రప్పా బ్యాచ్ ఏమైందని బీటెక్ రవి ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది: మారెడ్డి లతారెడ్డి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 01:36 PM