Share News

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి

ABN , Publish Date - May 04 , 2025 | 09:52 AM

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి
CM Chandrababu Naidu

అమరావతి: భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.


ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. గంగను భువికి తెచ్చిన ఆ మహనీయుడిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని తెలిపారు. ఏదైనా సాధించాలనే పట్టుదలకు భగీరథ ప్రయత్నం ఒక స్పూర్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం: నారా లోకేష్

lokesh-mangalagiri.jpg

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. జలం ఉన్నచోటే సంస్కృతి, నాగరికతల వికాసం జరుగుతుందని ఉద్ఘాటించారు. ప్రజల శ్రేయస్సు కోసం గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన భారతీయ సంప్రదాయానికి గొప్ప ముద్ర వేశాయని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.


భగీరథుని స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సాకారం చేసి భగీరథుని కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం మన సంస్కృతిపై గౌరవానికి నిదర్శనమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం

Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి

YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 02:57 PM