Nara Lokesh Counter on Jagan: జగన్ ఆటలు ఇక సాగవు.. మంత్రి నారా లోకేష్ వార్నింగ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:46 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు.
అమరావతి, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (Ysrcp) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఫేక్ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ కుట్ర పన్ని.. వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు. చట్టం నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.కూటమి ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జగన్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్ ఆటలు ఇక సాగవని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ విగ్రహానికి సంబంధించిన ఓ వీడియోని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకి బెయిల్ ఆర్డర్స్ ఇవ్వకుండా సిట్ పిటిషన్
పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News