Share News

TS Politics: ‘ఒవైసీ బ్రదర్స్‌ను చంపేందుకు బుల్లెటో.. జైలో అవసరం లేదు’.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:50 PM

Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.

TS Politics: ‘ఒవైసీ బ్రదర్స్‌ను చంపేందుకు బుల్లెటో.. జైలో అవసరం లేదు’.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
BJP MLA Raja singh

హైదరాబాద్, ఏప్రిల్ 16: ‘‘మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Rajasingh) స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు. ‘‘అసద్‌ను చంపేందుకు బుల్లెటో.. జైలో అవసరం లేదు’’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ కాళ్ళు పట్టుకునే చరిత్ర ఎంఐఎంది (MIM) అంటూ విమర్శలు గుప్పించారు.

Lok Sabha Polls 2024: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు? ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ఇదే


తెలంగాణలో వచ్చేది బీజేపీ (BJP) గవర్నమెంట్అని.. అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్ళ కాళ్లు పట్టుకున్నప్పుడు.. ఓవైసీ వాళ్ళను పైకి పంపాలా?.. ఎక్కడకు పంపాలనే దానిపై ఆలోచిస్తామని అన్నారు. ముస్లింలను ఓవైసీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపైన ప్రచారం నిర్వహించాలని సవాల్ విసిరారు. క్యాండిడేట్ ప్రచారం సక్కగా చేసుకో రెచ్చగొట్టే వాఖ్యలు చేయకు’’ అంటూ అక్బరుద్దీన్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ హెచ్చరించారు.

Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!


అక్బర్ ఏమన్నారో చూద్దాం..

కాగా.. పాతబస్తీలో జరిగిన ఎంఐఎం సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఓవైసీ బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారంటూ అక్బర్ కామెంట్స్ చేశారు. తమను జైల్లో పెట్టి.. స్లాపాయిజన్ ఇచ్చి హత్య చేస్తారనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బలంగా ఉన్నామని.. అందుకే ఓవైసీ బ్రదర్స్‌ను ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గెలిచేది తామే అంటూ అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే తమను చంపేందకు చూస్తున్నారంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజీకాయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల వేళ అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది సింపతీ కోసమేనా అనే చర్చ జోరుగా నడుస్తోంది.


ఇవి కూడా చదవండి..

KTR: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్... కేటీఆర్ విసుర్లు

Venigandla Ramu: గుడివాడలో పిట్టలదొర కబుర్లు చెప్పిన సీఎం జగన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 16 , 2024 | 05:16 PM