Home » Asaduddin Owaisi
తనను హతమార్చుతామంటూ బెదిరింపు ఫోన్కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఢిల్లీ ఇంటిపై(Delhi house) దాడి (attack) జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకును(black ink) విసిరి ఆయన పేరు కనిపించకుండా చేశారు.
మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన్ను వెంటనే ఎంపీ పదవి నుంచి తొలగించాలని ప్రముఖ అడ్వొకేట్ హరిశంకర్ జైన్ రాష్ట్రపతిని కోరారు.
పార్లమెంటులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తూ చివర్లో 'జై పాలస్తీనా' అని నినదించడం విమర్శలకు దారితీయడంతో ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకుంటూ ''ఉత్తుత్తి బెదరింపులకు బెదిరేది లేదు'' అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఎంపీలు లోక్సభలో నేడు (మంగళవారం) ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రమాణం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణస్వీకారం చేశారు.
హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై పతంగి మరోసారి ఎగిరింది. వరుసగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi).. ఔర్ ఏక్ బార్ అంటూ ఐదోసారి కూడా విజయఢంకా మోగించారు. మొత్తం 10,47,659 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు మరోసారి మజ్లిస్ పార్టీకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏకంగా 3,38,087 ఓట్ల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. అసదుద్దీన్కు 6,61,981 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు 3,23,894 ఓట్లు వచ్చాయి.
మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు
హైదరాబాద్ లోక్సభ స్థానం మజ్లిస్ కు కంచుకోటగా మరోసారి రుజువు చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించిన మజ్లిస్ పార్టీ వర్గాలు 2019 నాటి ఎన్నికల కంటే మరింత మెజారిటీతో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) విజయం సాధించి తీరుతారని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.