Share News

Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:47 PM

పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను హత్య చేయడానికి చూస్తున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారారు. సింపతీ కోసం ట్రై చేస్తున్నారో మరో కారణమో కానీ ఆయనైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు.

Akbaruddin Owaisi: మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

హైదరాబాద్: పాతబస్తీ ఎంఐఎం సమావేశంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను హత్య చేయడానికి చూస్తున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారారు. సింపతీ కోసం ట్రై చేస్తున్నారో మరో కారణమో కానీ ఆయనైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు అక్బరుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోందన్నారు.

ఓట్ల కోసం ‘ఉపాధి’ గేలం


హైదరాబాద్‌లో తాము చాలా బలంగా ఉన్నామని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామేనని అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు తమనేదో హత్య చేస్తారని ఆయన భయపడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పైగా తమ సోదరులిద్దరినీ జైలుకు పంపించాలని.. వైద్యం పేరిట స్లో పాయిజన్ ఇవ్వాలని చూస్తున్నారంటున్నారు. మరి అలా ఎవరు చూస్తున్నారు? ఏంటనేది కూడా చెప్పలేదు. మొత్తానికి ఒవైసీ ఎన్నికల వేళ సంచలనానికి తెరదీశారు.

ఇవి కూడా చదవండి...

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 03:01 PM