Share News

Loksabha Elections 2024: దక్షిణ భారతంపై మోదీ వివక్ష చూపుతున్నారు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 03 , 2024 | 05:04 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Loksabha Elections 2024: దక్షిణ భారతంపై మోదీ వివక్ష చూపుతున్నారు: మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao

ఖమ్మం: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ స్థాయి మరచి నిసిగ్గుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు.పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు గెలిచి రిజర్వేషన్ మార్చాలనే కుట్రకు మోదీ ఆలోచన చేస్తు్న్నారని ఆరోపించారు.అన్ని కులాలు, మతాలు అక్కున చేర్చుకునేలా ఇందిరాగాంధీ పాలన చేశారని కొనియాడారు. దేశంలో టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ బాటలు వేశారన్నారు.


TS News: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్

ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా దేశ ప్రగతి కోసం రాహుల్ గాంధీ ఉన్నతంగా నిలబడ్డారని తెలిపారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా నిలబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాగ్ధానాలు మోదీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. విద్వేషాల పునాదుల మీద ఉత్తర భారతంపై ప్రేమ.. దక్షిణ భారతం పట్ల వివక్షగా మోదీ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి కేసులు నుంచి బయట పడటం కోసం బీఆర్ఎస్ బీజేపీతో లాలూచీ పడుతోందని మండిపడ్డారు.


Suprem Court: న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసు నిందితులకు సుప్రీం నోటీసులు

రేవంత్ రెడ్డినీ టచ్ చేయడానికి వీలు లేకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిర పాలన కోసం పార్టీలో చేరిన ఖమ్మం మేయర్, కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతలు ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఖమ్మం రింగ్ రోడ్ పూర్తయితే ప్రగతి బాటలో నడుస్తోందని వివరించారు. కాంగ్రెస్ పాలనలో అరాచకం, భూ కబ్జాలు లేని ఖమ్మం కోసం పాటుపడదామని ఉద్ఘాటించారు. అభివృద్ధి పనులతో ఖమ్మం కార్పొరేషన్ మోడల్‌గా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


Hyderabad: బ్యాంకు ఖాతా నుంచి రూ.20 లక్షలు ఖాళీ.. స్కైప్‌ కాల్‌తో రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల వల

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 03 , 2024 | 05:04 PM