Share News

TS News: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్

ABN , Publish Date - May 03 , 2024 | 01:41 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్‌ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

TS News: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్‌ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నేడు (శుక్రవారం) తీర్పు వెలువరించింది.


ఇదీ అసలు కథ..

ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. . ఈ క్రమంలోనే దండె విఠల్‌కు రూ.50,000ల జరిమానా విధించింది. బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా దండే విఠల్ నామినేషన్ వేశారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ సంతకం పోర్జరీ చేశారు. రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్టు ఫోర్జరీ సంతకాలతో రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు ఇచ్చింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రాజేశ్వర్ కోర్టును ఆశ్రయించారు. తాను నామినేషన్‌ను ఉససంహరించుకోలేదని, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు తెలిపారు. దండే విఠల్ ఎన్నికను రద్దు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు

Read Latest TS News And Telugu News

Updated Date - May 03 , 2024 | 01:59 PM