Share News

Atchannaidu: ‘ముస్లింలను నమ్మకూడదు’ అన్న వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలి

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:38 PM

Andhrapradesh: నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న ముస్లిం యువతిని వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి అని - ముస్లింలపై జాతి అహంకారంతో జగన్ రెడ్డి అండ్ కో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

Atchannaidu: ‘ముస్లింలను నమ్మకూడదు’ అన్న వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలి

అమరావతి, ఏప్రిల్ 6: నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న ముస్లిం యువతిని వైసీపీ (YSRCP) నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu)అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి (CM Jagan) అని - ముస్లింలపై జాతి అహంకారంతో జగన్ రెడ్డి అండ్ కో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముస్లింలను నమ్మకూడదు’ అని ముస్లిం జాతిని అవమానించిన వైసీపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

AP Politics: ఎన్నికల వేళ జగన్‌కు నాన్‌స్టాప్ షాక్‌లే.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే జంప్..!


మొన్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీ అభ్యర్ధి బంధువు వహీద అనే ముస్లిం మహిళపై చెప్పుతో దాడి చేశారని గుర్తుచేశారు. అలాగే గతంలోను వైసీపీ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్నారు. ఐదేళ్లల్లో ముస్లింలపై 60కి పైగా దాడులు, 15 మందికి పైగా అత్యాచారాలు, 9 మందిపై హత్యలు, వేలాది మందికి అవమానాలు జరిగాయన్నారు. టీడీపీ ఎప్పుడూ ముస్లింల పక్షాన నిలిచిందని.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 01:04 PM