Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Kollu Ravindra: బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటన

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:44 PM

Andhrapradesh: టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు..ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా.. విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని తెలిపారు.

Kollu Ravindra: బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటన

అమరావతి, మార్చి 2: టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు..ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (CM Jagan Reddy) దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా.. విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆలోచన అని తెలిపారు. బీసీల అభిప్రాయాలు.. చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ (TDP) ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ (BC Declaration) అని చెప్పుకొచ్చారు.

Atchannaidu: ప్రజలకు తాగునీరు అందించలేరా.. సిగ్గుచేటు..!

మార్చి 5న మంగళగిరి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జయహో బీసీ మహాసభ సాక్షిగా బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ 15 మంది సభ్యుల కమిటీని నియమించిందన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీకులగణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్లో ప్రకటిస్తామన్నారు. జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచీ బీసీలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీసీ సోదరుల నినాదాలతో తాడేపల్లి ప్యాలెస్ కంపించాలని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో మరో కొత్త కోణం.. చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishanreddy: ఆ సంప్రదాయాన్ని సీఎం రేవంత్ పాటిస్తే బాగుంటుంది...


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 04:52 PM