Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Atchannaidu: ప్రజలకు తాగునీరు అందించలేరా.. సిగ్గుచేటు..!

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:09 PM

Andhrapradesh: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులపై సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు.

Atchannaidu: ప్రజలకు తాగునీరు అందించలేరా.. సిగ్గుచేటు..!

అమరావతి, మార్చి 2: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులపై సీఎం జగన్‌కు (CM Jagan) టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. గుంటూరులో కలుషిత జలంతో డయేరియా, కలరా కేసులు ప్రబలుతున్నాయన్నారు. లక్షలాదిమంది ఆస్పత్రిపాలవుతున్న జగన్‌కు పట్టకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే అని అన్నారు. గుంటూరులో డయేరియాతో నలుగురు మృతి చెందగా.. ముగ్గురికి కలరా వ్యాధి సోకిందన్నారు. సిద్ధం సభలపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరమన్నారు.అధికారంలో ఉండే ఈ నెల రోజులైనా ప్రజల గురించి ఆలోచించాలని.. వెంటనే ప్రజలకు సురక్షిత నీరు అందించాలని.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన ఆ రోజేనా?


Shocking: ఆ డబ్బులతో విమానంలో వెళ్లొచ్చు.. బెంగళూరు ఉబర్ క్యాబ్ రేటు చూసి షాకైన ప్రయాణికుడు..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 02 , 2024 | 04:10 PM