Share News

Lokesh Nomination: లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమి నేతల పూజలు.. తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:18 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు కుప్పం బాటలోనే మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్‌ వెళ్లనున్నారు. లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ వేయనున్నాను. లోకేష్ నామినేషన్‌తో మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది.

Lokesh Nomination: లోకేష్ నామినేషన్ పత్రాలతో కూటమి నేతల పూజలు.. తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు
TDP Leader Nara Lokesh Nomination

అమరావతి, ఏప్రిల్ 18: ఏపీలో ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల (Nominations) పర్వం షురూ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు కుప్పం బాటలోనే మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్‌ (Nara Lokesh) వెళ్లనున్నారు. లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ వేయనున్నాను. లోకేష్ నామినేషన్‌తో మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపటి క్రితమే నారా లోకేష్ నామినేషన్ (Lokesh Nomination) పత్రాలతో కూటమి నేతలు పూజలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, మహిళలు తరలివచ్చారు.

AP Elections: వైసీపీ లెక్కలు తారుమారు.. ఆందోళనలో అభ్యర్థులు..


పాత మంగళగిరి సీతారామకోవెలలో యువనేత నారా లోకేష్ నామినేషన్ పత్రాలతో టీడీపీ-జనసేన-బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పూజలు నిర్వహించారు. టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు జరిగాయి. నామినేషన్ పత్రాలకు పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది.

AP Elections: కృష్ణా జిల్లాలో 6 సార్లు పసుపుకే పట్టం.. ఈసారి సీన్ మారుతుందా..!?


ద్విచక్ర వాహనాలపై వేలాదిగా టీడీపీ- జనసేన- బీజేపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ వేయనున్నారు. లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు లోకేష్ నామినేషన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి 10వేల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొనేనాలా ప్రణాళిక రూపొందిచారు.


ఇవి కూడా చదవండి...

CM Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో బిగ్ అప్‌డేట్

AP Elections: ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల... మొదలైన నామినేషన్ల ప్రక్రియ

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 12:29 PM