Bride: బ్యూటీ పార్లర్‌కని వెళ్లి ఎంతకూ తిరిగిరాని వధువు.. అనుమానంతో వెళ్లి చూసిన బంధువులకు షాకింగ్ ట్విస్ట్.. వరుడికి విషయం తెలిసి..!

ABN , First Publish Date - 2023-05-31T21:36:34+05:30 IST

కొదంరు యువతులు తమకు ఇష్టం లేకున్నా పెద్దల బలవంతం మీద వివాహాలు చేసుకుంటుంటారు. తల్లిదండ్రుల పరువు పోతుందనే ఉద్దేశంతో రాజీపడి భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మరికొందరు తమ ఇష్టాన్ని వదులుకోలేక.. ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటూ సడన్‌గా..

Bride: బ్యూటీ పార్లర్‌కని వెళ్లి ఎంతకూ తిరిగిరాని వధువు.. అనుమానంతో వెళ్లి చూసిన బంధువులకు షాకింగ్ ట్విస్ట్.. వరుడికి విషయం తెలిసి..!
ప్రతీకాత్మక చిత్రం

కొందరు యువతులు తమకు ఇష్టం లేకున్నా పెద్దల బలవంతం మీద వివాహాలు చేసుకుంటుంటారు. తల్లిదండ్రుల పరువు పోతుందనే ఉద్దేశంతో రాజీపడి భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మరికొందరు తమ ఇష్టాన్ని వదులుకోలేక.. ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటూ సడన్‌గా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు తీరా వివాహ సమయం దగ్గర పడుతుందనగా.. ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వధువు పెళ్లికి కొన్ని గంటల ముందు బ్యూటీ పార్లర్‌కని వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కొత్వాలి పరిధి మోరెనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడికి.. రాజస్థాన్‌లోని బారీ అనే ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతితో వివాహం (young woman Marriage) నిశ్చయమైంది. రెండు కుటుంబాల వారు మాట్లాడుకుని.. యోగేష్, శిల్పి వివాహాన్ని మే 29న జరిగిపించేలా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ముహూర్త సమయం దగ్గరపడడంతో అంతా పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇంతలో పెళ్లి రోజు రానే వచ్చింది. రెండు కుటుంబాలతో పాటూ వారి వారి బంధువులు, సన్నిహితులు, స్నేహితులంతా కళ్యాణ పంటపానికి చేరుకున్నారు. వరుడు పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై.. వధువు కోసం వేచి చూస్తున్నాడు. శిల్పి ముహూర్తానికి కొన్ని గంటల ముందు బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది.

Viral News: చేసేదే పాడు పని.. పైగా వీడియో తీసుకున్నారు.. ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ లాయర్.. అడ్డంగా దొరికిపోయారుగా..!

మేకప్ చేయించుకుని తిరిగి వస్తానన్న యువతి.. ఎంతకీ మంటపానికి రాలేదు. కాసేపు ఆగితే వస్తుందిలే అనుకుని అంతా ఓపిగ్గా ఎదురు చూశారు. అయితే గంటలు గడుస్తున్నా యువతి మాత్రం రాలేదు. దీంతో చివరకు విసుగొచ్చి బ్యూటీ పార్లర్‌ (Beauty parlour) వద్దకు వెళ్లగా.. అక్కడ ఆమె లేదు. చుట్టు పక్కల విచారించినా ఆచూకీ లభించలేదు. వధువు ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకున్న వరుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయం బయటికి తెలియడంతో వధువు కుటుంబ సభ్యులతో పాటూ బంధువులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరుడు తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తన వద్ద ఉన్న 150 గ్రాముల బంగారు ఆభరణాలు (Gold ornaments) కూడా తీసుకెళ్లిందని చెప్పారు. యువతి ఎక్కడికి వెళ్లి ఉంటుందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Wife: నా శవాన్ని ఒక్కసారి హత్తుకో.. అదే నా చివరి కోరిక.. అంటూ భార్యకు మెసేజ్ పంపిన భర్త.. 15 రోజుల క్రితమే పెళ్లయింది కానీ..!

Updated Date - 2023-05-31T21:36:34+05:30 IST