Home » Madhya Pradesh
రెండో పెళ్లి చేసుకోవటతానికి సిద్ధమైన ఓ వ్యక్తితో అతడి మొదటి భార్య, పిల్లలు దాడి చేశారు. కోర్టులోని అతడిని అతడికి కాబోయే రెండో భార్యని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు.
ఓ వృద్ధుడి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా ముగిసిపోయింది. ఇంటి బయట సేద తీరుతున్న అతడిని కంకర ట్రక్ రూపంలో మృత్యువు కబళించింది. కంకర ట్రక్ మీదపడ్డంతో వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు.
సాధారణంగా రోడ్లంటే నల్లగా ఉంటాయి. కాంక్రీట్ రోడ్లంటే బూడిద రంగులో ఉంటాయి. మధ్య ప్రదేశ్లో నిర్మించిన ఎరుపు రంగు రహదారి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ ఖైదీ పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. పోలీస్ జీప్ నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సత్నాకు చెందిన కొంతమంది పసికందులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం సత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి డాక్టర్లు వారికి రక్తం ఎక్కించారు. ఆ రక్తం కారణంగా ఏకంగా ఆరుగురు చిన్నారులు హెచ్ఐవీ బారినపడ్డారు.
పోలీసులు సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల జీవితాలను, ఆస్తులను రక్షణ కల్పిస్తుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థను తల దించుకునేలా చేశారు మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లా మల్హార్గఢ్ పోలీసులు.
మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎరువుల కోసం క్యూ లైన్లో నిల్చున్న ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న బాధతో ఓ యువకుడు కరెంట్ టవర్ ఎక్కాడు. ప్రియురాలితో పెళ్లి చేయకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఇలాంటి సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తెలివి కారణంగా అతడు దెబ్బకు కిందకు దిగి వచ్చాడు.
బ్రిడ్జిపై నిలబడి రీల్స్ చేస్తుండగా ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డంతో తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.