Home » Madhya Pradesh
ఓ అడవి జింకకు ఆహారం తినిపించడంతో అటవీ శాఖ ఉద్యోగి సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సత్పురా టైగర్ రిజర్వ్లో చోటుచేసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అడవి జంతువులకు ఆహారం పెట్టడంపై అటవీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్లో యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు.
AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడిించారు.
కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్లోని హేతమ్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్కోట్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు.
మధ్యప్రదేశ్లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో.. బీజేపీ విజయానికి మార్గం సుగమమైంది. ఆ రాష్ట్రంలో మూడో అభ్యర్థిగా మహేశ్ కేవత్కు అవకాశం కల్పించింది.
మధ్యప్రదేశ్లో ఓ గర్భిణికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఎదురైన ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే...