Viral News: ఈ మందుబాబు అతి ప్రేమను చూసి.. తలలు పట్టుకున్న ప్రయాణికులు.. ఇంతకీ బస్సు వద్ద ఇతడు చేసిన పని ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-06T16:01:25+05:30 IST

మందు కొట్టిన వ్యక్తులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో వారికే తెలీదు. కొందరు ఫుల్‌గా మందుకొట్టి సింహాలు, మొసళ్లతో చెలగాటం ఆడుతుంటారు. మరికొందరు పాములను మెడలో వేసుకుని మరీ హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం...

Viral News: ఈ మందుబాబు అతి ప్రేమను చూసి.. తలలు పట్టుకున్న ప్రయాణికులు.. ఇంతకీ బస్సు వద్ద ఇతడు చేసిన పని ఏంటంటే..

మందు కొట్టిన వ్యక్తులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో వారికే తెలీదు. కొందరు ఫుల్‌గా మందుకొట్టి సింహాలు, మొసళ్లతో చెలగాటం ఆడుతుంటారు. మరికొందరు పాములను మెడలో వేసుకుని మరీ హీరోయిజాన్ని చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మందుబాబుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులకు ధైర్యం చెబుతూ ఆర్టీసీ బస్సు వద్ద మందు బాబు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

తమిళనాడు (Tamil Nadu) తెన్‌కాశి నుం భావూరుఛత్ర మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50మందికి పైగా ప్రయాణికులతో (Passengers) తిరునల్వేలి వెళ్తున్న ప్రభుత్వ బస్సు (Govt bus) .. భావురుఛత్రలో రైల్వే ప్లైఓవర్ పనులు జరుగుతున్న ప్రదేశానికి రాగానే బస్సు (Damaged bus stairs) మెట్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కి, దిగలేని పరిస్థితి నెలకొంది. అలంకుళం, తిరునల్వేలి వెళ్లే ప్రయాణికులు.. వేరే బస్సులు లేకపోవడంతో భావూరుచత్రం బస్టాండ్ వద్ద చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో వారు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫుల్‌గా మందు కొట్టిన (drunk man) ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. బస్సు మెట్లను తాను సరి చేస్తానంటూ తన టవల్ తీసుకుని ఏవేవో ప్రయత్నాలు చేస్తాడు.

Viral Video: బుల్లెట్ వేగంతో ఇతడు తయారు చేసిన భేల్ పూరీ చూస్తే.. షాకవ్వడం మాత్రం ఖాయం..

మెట్ల వద్ద నేలపై కూర్చుని దెబ్బతిన్న దెబ్బతిన్న మెట్ల స్థానంలో టవల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాడు. ప్రభుత్వానికి తమ వంతు చేయూత అందించాలంటూ అక్కడున్న వారికి సందేశం ఇస్తాడు. ఇతడి ప్రవర్తనకు ప్రయాణికులంతా షాక్ అవుతున్నారు. అతడి ప్రేమను చూసి సంతోషించాలో, లేక అందరినీ ఇబ్బంది పెట్టినందుకు ఆగ్రహించాలలో తెలీని అయోమయంలో పడ్డారు. ఇలా ఉండగా.. చాలా సేపటి తర్వాత మరో బస్సు వచ్చి ప్రయాణికులను తీసుకెళ్లింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటొలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మందుబాబా.. మజాకా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి సమాజ సేవ అద్భుతం’’.. అని మరికొందరు, ‘‘నీ ఐడియా సూపర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2023-06-06T16:01:25+05:30 IST