తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నారు.
పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముకుంటూ లబ్ధిదారులను దోచుకుంటున్నారు. వస్తువు ధర పెరగాలంటే ఆ వస్తువు తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం అధికమవ్వాలి.
కాకతీయ విశ్వవిద్యాలయం- రాష్ట్రంలో అతిపెద్ద రెండో యూనివర్సిటీ. ఉన్నత విద్యను అందించడంలో, ప్రమాణాలు పాటించడంలో, పరిశోధనలు సాగించడంలో, నిష్ణాతులను అందించడంలో ఈ యూనివవర్సిటీ ఒకప్పుడు కేరా్ఫగా ఉండేది. ఉస్మానియా తర్వాత, చారిత్రక వరంగల్ కేంద్రంగా కేయూ తనదైన అస్థిత్వాన్ని చాటుకుంది. లక్షలాది మంది విద్యార్థులకు విద్యావెలుగులు పంచింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.
ఓరుగల్లు గులాబీ నేతలు కేసీఆర్, కేటీఆర్ వర్గాలుగా విడిపోయారని బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్సరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిల మధ్య విభేదాలను ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ ఎపిసోడ్... ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రాజకీయాలకు తెరతీసింది. ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అధిష్ఠానం కవితను పార్టీ నుంచి గెంటేయడంతో అటు బీఆర్ఎస్, ఇటు జాగృతి శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. తాజా పరిణామాలతో గులాబీ కండువాతో పాటు జాగృతి కండువా కప్పుకుని పని చేసిన నేతలు.. ఎటుపోవాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లా యంత్రాంగాలు ఏ ర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. బీసీ లకు 42శాతం రిజర్వేషన్ల ఆమోదం కూడా పొందడంతో ఏ క్షణాన్నయినా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లోగా ఏర్పాట్లు పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలోని రైతులు యూరియా కోసం సోమవారం భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అన్నదాతల ధర్నాతో మరిపెడ బంగ్లా అట్టుడికింది. పోలీసులు సైతం రైతుల ఇబ్బందులను గుర్తించి చేసేదేమీ లేక చేతులెత్తేశారు.
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు.