ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. బుధవారం నుంచి నాలుగురోజులపాటు జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రత్యేక పూజలతో సమ్మక్క-సారలమ్మలనే తిరిగి వన ప్రవేశం చేస్తారు.
వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మేడారం విచ్ఛేసి.. సమ్మక్క - సారలమ్మలను దర్శించుకోనున్నారు.
మేడారం మహాజాతర దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం ఆయన మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వచ్చి వన దేవతలను దర్శించుకున్నారు.
వరంగల్ భద్రకాళి అమ్మవారికి పెన్నా సిమెంట్స్ అధినేత ఉత్తమ్రెడ్డి ప్రతా్పరెడ్డి అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలు బహూకరించారు. రూ.4 కోట్ల విలువైన 111 కిలోల వెండి ఆభరణాల తొడుగు....
ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల మామునూరు విమానాశ్రయం సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కి అప్పగించింది.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. గురువారం మేడారం చేరుకోనున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం నేడు మేడారంలో వనదేవతలను దర్శించుకోనున్నారు.
ములుగు జిల్లా కన్నెపల్లి ఆలయంలో సారలమ్మ కాసేపట్లో మేడారం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య కన్నెపల్లి పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మేడారం మహాజాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు సాలరమ్మ గద్దెపైకి చేరుకోనున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భూపాలపల్లి జిల్లా సింగరేణి గనుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గనికి సంబంధించిన ల్యాంప్రూమ్లో మంటలు వ్యాపించాయి. గనిలో పనిచేసే కార్మికులకు సంబంధించిన 1500 ల్యాంప్లు మంటల్లో కాలిపోయాయి.