ఏకశిలా జూనియర్ కళాశాల (Ekashila Junior College) బాలికల క్యాంపస్లో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ ( Intermediate) మెుదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి(Sridevi) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.
పేదలను, రైతులను సీఎం రేవంత్రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్రావు విమర్శించారు.
Telangana: చెల్పాక ఎన్కౌంటర్ ప్రాంతాన్ని పౌరహక్కుల సంఘం నేతలు పరిశీంచారు. చెల్పాక ఎన్కౌంటర్ అంతా బూటకమే అని, అన్నంలో విషం పెట్టి చంపారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపించారు.
పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం తెలంగాణ గవర్నర్ను కలిశారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.కాంట్రాక్టర్లు రూ,200 కోట్లు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా: బలగం సినిమా గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. బలగం సినిమా గ్రామీణ నేపథ్యం పాటలతో మొగిలయ్య ఆకట్టుకున్నారు.
ములుగు జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులుగుర్తించారు. పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ములుగు: జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు.
రాయపర్తి ఎస్బీఐలో కోట్లాది రూపాయిల బంగారం చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అక్రమార్కు లపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాం గం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని.. మర పట్టి సివిల్ సప్లయీస్ శాఖకు బియ్యంగా అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లర్లు దర్జాగా సీఎంఆర్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్లో రూ.91.80కోట్ల అవినీతి జరిగినట్టుగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం గుర్తించింది. అయితే అక్రమార్కులు క్రిమినల్ కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.