Maoist party: పూజార్ కంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ శనివారం ఓ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
Telangana: రాజ్కుమార్ ఆటోలో ఉన్న సమయంలో అతడి ప్రత్యర్థి అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్కుమార్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.
Singer Madhupriya: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో గాయని మధుప్రియ పాట షూటింగ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఆలయ అధికారులు స్పందించాల్సి ఉంది.
రైతు భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఈనెల 16 నుంచి 26 వరకూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రైతు భరోసా అమలు చేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.
వరంగల్ రీజియన్కు తెలంగాణ ఆర్టీసీ కేటాయించిన 112 ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవాళ(సోమవారం) 50 బస్సులను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. హనుమకొండ బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సులను ప్రారంభించారు.
TELANGANA: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం ప్రెషర్ బాంబ్ పేలింది. ఈ సంఘటనలో వెంకటాపురం మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్ అనే వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mallu Bhatti Vikramarka: రైతు రుణ మాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. రైతులకు రుణా మాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.
Telangana: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మిర్చి పంట పొలంలో పులి అడుగులు గుర్తించిన రైతులు, కూలీలు తమ పనులను ఆపేసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణ: ఆడవారిపై అత్యాచారాలు, హత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజుకో అత్యాచార ఘటన వెలుగు చూస్తోంది. ఒక ఘటన జరిగి దాన్ని మరవకముందే మరో ఘటన కలకలం రేపుతోంది.