• Home » Telangana » Warangal

వరంగల్

విప్లవోద్యమంలో జంగ్‌ సైరన్‌..!

విప్లవోద్యమంలో జంగ్‌ సైరన్‌..!

మోడెం బాలకృష్ణ.. రాడికల్‌గా విప్లవ బాట పట్టాడు. పీడిత ప్రజానీకం కోసం నాలుగున్నర దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేశారు. ‘జంగు సైరనూదిరో.. జైలులో మాయన్నలు’ అనే పాటకు స్ఫూర్తినిచ్చేలా తన విప్లవ సహచరులు పటేల్‌ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో కలిసి మోడెం జైలులోనే జంగ్‌ సైరన్‌ మోగించి జైలునే పోరాట కేంద్రంగా మలిచారు.

స్కూల్‌ గేమ్స్‌పై నిర్లక్ష్యమేల?!

స్కూల్‌ గేమ్స్‌పై నిర్లక్ష్యమేల?!

స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎ్‌ఫఐ) క్రీడా పోటీల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఎస్‌జీఎ్‌ఫఐ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు మొదటి, రెండో వారంలో మండలస్థాయి టోర్నమెంట్లు పూర్తి కావాలి. మూడో వారంలో జోనల్‌ (అంతర్‌మండల) టోర్నమెంట్స్‌తో పాటు జిల్లా టీమ్‌ల ఎంపిక జరగాలి.

ప్రశాంతంగా..

ప్రశాంతంగా..

యూరియా కోసం గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు, తోపులాటల మధ్య పంపిణీ కొనసాగింది. ఇప్పుడు అవన్నీ గొడవలు లేకుండా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అధికారుల పక్కా పర్యవేక్షణతో రైతులకు బస్తాల సరఫరా జరుగుతోంది. ధర్నాలకు, రాస్తారోకోలకు తావులేకుండా.. అందరికీ యూరియా అందిస్తున్నారు.

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

CM Revanth on Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఎప్పుడంటే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.

దడ పుట్టిస్తున్న ధరలు

దడ పుట్టిస్తున్న ధరలు

పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముకుంటూ లబ్ధిదారులను దోచుకుంటున్నారు. వస్తువు ధర పెరగాలంటే ఆ వస్తువు తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు, ఇతర ఉత్పత్తి వ్యయం అధికమవ్వాలి.

గతమెంతో ఘనం.. వర్తమానం దైన్యం

గతమెంతో ఘనం.. వర్తమానం దైన్యం

కాకతీయ విశ్వవిద్యాలయం- రాష్ట్రంలో అతిపెద్ద రెండో యూనివర్సిటీ. ఉన్నత విద్యను అందించడంలో, ప్రమాణాలు పాటించడంలో, పరిశోధనలు సాగించడంలో, నిష్ణాతులను అందించడంలో ఈ యూనివవర్సిటీ ఒకప్పుడు కేరా్‌ఫగా ఉండేది. ఉస్మానియా తర్వాత, చారిత్రక వరంగల్‌ కేంద్రంగా కేయూ తనదైన అస్థిత్వాన్ని చాటుకుంది. లక్షలాది మంది విద్యార్థులకు విద్యావెలుగులు పంచింది.

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు

కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kadiyam Srihari Counter on KCR:  కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

Kadiyam Srihari Counter on KCR: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.

విభేదాల గులాబీ

విభేదాల గులాబీ

ఓరుగల్లు గులాబీ నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌ వర్గాలుగా విడిపోయారని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌ వేటుకు గురైన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిల మధ్య విభేదాలను ప్రస్తావిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

కవిత వెంట నడిచేదెవరు!?

కవిత వెంట నడిచేదెవరు!?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ ఎపిసోడ్‌... ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రాజకీయాలకు తెరతీసింది. ఊహించినట్టుగానే బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కవితను పార్టీ నుంచి గెంటేయడంతో అటు బీఆర్‌ఎస్‌, ఇటు జాగృతి శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. తాజా పరిణామాలతో గులాబీ కండువాతో పాటు జాగృతి కండువా కప్పుకుని పని చేసిన నేతలు.. ఎటుపోవాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి