పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
కొత్త ఠాణాలు, ట్రాఫిక్ పోలీ్సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం రాష్ట్ర సర్కారు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఏటా ఏటా నెల రోజుల పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆరోగ్యవంతంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది పోషణ మాసాన్ని విజయవంతం చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు పోషణ మాసం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఓరుగల్లులో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. కాంగ్రె్సలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మధ్య మాట ల యుద్ధం పతాకస్థాయికి చేరింది. ఽధర్మకర్తల నియామకంపై నాయిని చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను సురేఖ వరంగల్ జిల్లాలో అవిష్కరణ చేసేలా ఉత్తర్వులు రావడానికి నేతల మధ్య విభేదాలే కారణమనే చర్చ జరుగుతోంది.
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
ప్రసాద్ భార్య రష్మితకు కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారానికి భర్త ప్రసాద్ అడ్డుగా ఉన్నాడని, అతడిని చంపాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
నెల రోజులు దాటినా.. యూరియా కష్టాలు తీరడం లేదు. రాత్రివేల వెళ్లి పడుకున్నా.. ఉదయం వెళ్లి క్యూలో నిల్చున్నా రైతులకు బస్తా దొరుకుతది అన్న గ్యారంటీ లేదు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ యూరియా పంపిణీ చేసే కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు ఆందోళనబాట పట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుపై అయోమయం నెలకొన్నది. ఈనెల 15 సోమవారం నుంచి 21వ తేదీ వరకు మొదటిదఫాగా విద్యాసంస్థల బంద్ పాటించాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఆదివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈలోగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలిన ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.
హనుమకొండలోని ఒక ప్రైవేటు పాఠశాల పదో తరగతి విద్యార్థి పోలేపల్లి జయంత్ వర్ధన్ (15) ఆకస్మిక మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థి మృతి సంచలనం సృష్టించింది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ దుర్ఘటన ఒకిం త విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.