మద్యం షాపుల టెండర్కు లైసెన్స్ల గడువు పూర్తికాకముందే ప్రభుత్వం రెండు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో రూ.2లక్షలు ఉన్న టెండర్ ఫీజు(నాన్ రిఫండబుల్)ను ఈసారి రూ.3లక్షలకు పెంచి ప్రభుత్వ ఖజానా నింపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2025-27 మద్యం పాలసీని అమలు చేసేందుకు జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు.
జిల్లాలో బెల్టు షాపులు విచ్చల విడిగా వెలుస్తున్నాయి. వాడవాడకూ ఏర్పాటు అవుతోండడంతో మందు బాబుల చేబులకు చిల్లులు పడుతున్నాయి. గ్రామాలు, తండాల్లో జోరుగా బెల్టుషాపులు, గుడుంబా అ మ్మకాలు సాగుతోండడంతో మందు ప్రియులు మత్తులో జోగుతున్నారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వడానికి చత్తీ్సగడ్ సానుకూలత వ్యక్తం చేయటం రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కొత్త ఆయకట్టుపై సీడబ్ల్యుసీ అభ్యంతరాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద చూపించిన ఎస్సారెస్పీ-2 ఆయకట్టును సమ్మక్క సాగర్ కింద చూపించటం ఏమిటని సీడబ్ల్యుసీ ప్రశ్నిస్తోంది. సమ్మక్కసాగర్కు కొత్త ఆయకట్టు చూపించాలని సీడబ్ల్యుసీ కోరుతోంది.
మేడారం సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్నిరూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
సుప్రీంకోర్టులో ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల ట్రైబల్ కేసుపై మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
మేడారం మూలాలను కాపాడుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల మనోభావాలకు తగినట్టుగా గద్దెల మార్పులు చేస్తున్నామని చెప్పారు. పూజారులతో మరోసారి సీఎం చర్చించి డిజైన్లు ఫైనల్ చేస్తారని వెల్లడించారు.
ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం క్షేత్రంలో చరిత్రాత్మక మార్పులు రాబోతున్నాయి. రెండేళ్లకోసారి కోటి మందిని రప్పించే కోన ఆధునిక రూపును సంతరించుకోనుంది. ‘మాస్టర్ ప్లాన్’ పేరుతో మేడారాన్ని మరింత సౌలభ్యంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధమైంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.
భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు