Home » Telangana » Rangareddy
మార్కెట్లో కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్కు పంటను తరలిస్తే క్వింటాల్కు రూ.150 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోందని లబోదిబోమంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఎరిత్రో ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంగణం అంతా మంటల్లో చిక్కుకోగా, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధుల నుంచి తిరిగి వస్తూ కల్వర్ట్ గుంతలో పడి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎర్రగా దోసకాయలా ఉంది. కొబ్బరి కాయలా రెండు ముక్కలు చేసి, దానిలోని ఎర్రని గుజ్జును స్పూన్తో తీసి జ్యూస్ చేశారు. జ్యూస్ రుచి కొంచెం వగరు, పులుపుగా ఉంది.
వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో బంగారు నగల కోసం వృద్ధురాలిని హత్య చేసి, అనంతరం సాక్ష్యాలను మాయం చేయడానికి శవాన్ని తగలబెట్టిన దారుణ సంఘటన బయటపడింది.
వికారాబాద్లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే చేవెళ్లలోని ఎంకేపల్లి వద్ద ఆధునిక గోశాలకూ ఆయన శంకుస్థాపన చేశారు. కుటుంబసమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.