Home » Telangana » Rangareddy
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది. మేడ్చల్ జిల్లా కైలాష్ హిల్స్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో మాట్లాడారు.
అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని రేవంత్ పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాలు తగ్గే అవకాశం ఉండడంతో రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది డిసెంబరు నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అదే నెల 22వ తేదీన కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహావీర్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి.