సాధారణంగా డీజిల్, పెట్రో విక్రయాలు ఎక్కు వగా రిటైల్ అవుట్లెట్ బంకుల్లో అధికంగా ఉంటాయి. అవికాక పెద్ద ఎత్తున వ్యాపారం చేసే కార్పొరేట్ సంస్థలు లారీలు అధికంగా ఉంటే సదరు సంస్థలు, చమురు విక్రయించే సంస్థల నుంచి అనుమతి తీసుకొని, సొంతంగా బంకులను ఏర్పాటు చేసుకుంటాయి.
దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ మిషన్ ఓ ఉద్యమంగా చేపట్టారు. దాదాపు పుష్కర కాలంగా ఈ మిషన్ కింద బహిరంగ మలవిసర్జన రహిత ఆవాసాలు, గ్రామాలు, మండలాలు, జిల్లాలను ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) జిల్లాలుగా అధికార యంత్రాంగం రేటింగ్లను ప్రకటించుకుంది. అయినా ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది.
సహకార సంఘాల పాలకవర్గాలను త్వరలో నామినేట్ చేయాలని కేబినె ట్ తీర్మానించడంతో అధికార కాంగ్రెస్ నాయకుల్లో సందడి మొదలైంది. సహకార పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బస్సు ఆపలేదనే కోపంతో ఒక ప్రయాణికుడు ఆర్టీసీ డ్రైవర్పై దాడికి దిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎండలు దంచికొడుతుండటంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.
యాదాద్రి నుంచి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఓ వైపు ప్రైవేట్ భూముల సే కరణకు సన్నాహాలు చేస్తునే, మరోవైపు నిర్మాణ సామగ్రిని పనుల ప్రాంతానికి తరలిస్తున్నారు.
పరిషత్ ఎన్నికలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో 2025 జూలై 10వ తేదీ తర్వాత నమోదైన ఓటర్లతో కొత్త జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల ప్రజల సొమ్మును కొల్లగొట్టిన యూనిక్ మర్చంటైల్ లిమిటెడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ పంజా విసిరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.60కోట్లకు పైగా బాధితులు నష్టపోయినట్లు సమాచారం.
: బెల్డ్ దుకాణాలతో మద్యం అందుబాటులోకి వచ్చి గ్రామాల్లో అన్నివర్గాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతుండగా యువత గంజాయి బారిన పడుతోంది.
బ్రహ్మోత్సవాలకు మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు జరుగనున్నాయి. త్రయోదశిలో నిర్వహించే కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.