ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం, సహకారంతో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. జిల్లా కేంద్రంలోని లైన్వాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరా న్ని ప్రారంభించి, మాట్లాడారు.
ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా పోలీస్, స్పెషల్బ్రాంచ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాయి.
నల్లగొండ కార్పొరేషన్లో అయిదుగురు, ఇతర అన్ని మున్సిపాల్టీల్లో నలుగురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకునే అవకాశముంది. ఎన్నికల్లో పోటీ అవకాశం పొందలేకపోయినవారు, పోటీ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కోఆప్షన్ సభ్యులుగా హామీ పొందనివారు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
సూర్యాపేట టౌన, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ తేజ్సనందలాల్పవార్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లాకేంద్రంలో శుక్రవారం ప్రారంభించి, అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
చివ్వెంల మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికావడం పరిపాటిగా మారింది. పలు గ్రామాల్లో అక్రమార్కుల చేతుల్లోకి పోవడంతో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి.
ప్రజాభరోసాతో పేరుతో ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పోలీసులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రయత్నిస్తున్నారు. కానీ సూర్యాపేటరూరల్ పోలీ్సస్టేషన సిబ్బంది ఆయన లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
పెన్పహాడ్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మం డలంలోని దూపహాడ్ గ్రామానికి చెందిన దివంగత పిన్నాని కనకయ్య, వెంకమ్మ దంపతులకు చిన్న కుమారుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం, కొరత కారణంగా ఉమ్మడి మండలంలోని చిలకమర్రి, ఘనిపల్లి, భీమనపల్లి, రాంపురం, దుగ్యాల, తిరుమలగిరి గ్రామాల్లో ఉపాది హామీ పనులు సకాలంలో ప్రారంభం కావడం లేదు.
ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారు. రెండేళ్లుగా మునుపెన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనా పంటల సాగుకు నీరందడం లేదు.
శాలిగౌరారం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రేమ విఫలమైందని ఇద్దరు యువకు లు క్రిమిసంహార మందు తాగి ఆత్మహత్యాయ్నం చేశారు.