అధిక వడ్డీ పేరుతో రైతులను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామంలో 60 మంది రైతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి కుచ్చుటోపి పెట్టాడు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు చెందిన పలువురు జిల్లాస్థాయి అధికారులు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. జిల్లా రవాణాశాఖ అధికా రి సాయికృష్ణ, నాగర్కర్నూల్ డీటీవోగా బదిలీపై వెళ్లారు.
ఆటుపోట్లు, ఇబ్బందుల నడుమ కొనసాగి న యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో చివరిదశకు చేరింది. ఈసారీ ధాన్యం విక్రయాల్లో అన్నదాతలు అవస్థలు ఎదుర్కొన్నారు. తాలు, తేమ పేరుతో ధాన్యం తూకం, ధరలో కోత విధించడం ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రక్రియకు ప్రధాన అడ్డంకి గా మారింది. లారీల కొరత, దిగుమతుల్లో జాప్యం రైతులను ఆగ్రహానికి గురిచేసింది.
చెరువులు, కుంటలపై మట్టిమాఫియా కన్నుపడింది. పూడికతీసి చెరువుల్లో నీటి నిల్వల పెంపు, రైతుల సాగుభూములను సారవంతం చేసేందుకు చెరువుమట్టి తరలించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తున్నారు.
జిల్లాకేంద్రంలో తోపుడు బండ్లపై మటన్ విక్రయాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు సైతం కేవలం ఆదివారం మాత్రమే కోస్తున్నారు కాబట్టి మాంసం తాజాగా ఉం టుందని కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేసిన మాంసం వండుకొని తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
దాదాపు 20 ఏళ్ల క్రితం భారతదేశంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా బత్తాయి తోటల సాగులో మొదటి స్థానంలో ఉండేది. సుమారు 4లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు చేసిన రైతులు ప్రస్తుతం దీనస్థితిలో ఉండిపోయారు.
ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్)కు జిల్లా యంత్రాంగం వడివడిగా అడుగులు వేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఓటరు సవరణ చేపట్టనున్నారు.
నైరుతి రుతు పవనాలు ఈ సారి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి మే 26వరకే కేరళకు నైరుతి రుతుపవనాలు వస్తాయని, అక్కడి నుంచి తెలంగాణ లో ఈ నెలాఖరులోగా వర్షాలు కురుస్తాయని తొలుత వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ పరిస్థితులు తలకిందులయ్యాయి.
పాలకవీడు మండలంలో ప్రసిద్ధి చెందిన జాన్పహాడ్ దర్గా వద్ద కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వక్ఫ్ బోర్డు నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మండలకేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పదో తరగతి ఫలితాలు ప్రకటించడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్ లో అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. తమ కళాశాలలో నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పేరుతో అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టాయి.