బ్యాంకర్లు, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతికంగా జరిగిన పొరపాటుతో అర్హత కలిగిన రైతులు రుణమాఫీ అందుకోలేకపోయారు.
జిల్లాలోని కోర్టుల బార్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
భువనగిరి మండలానికి చెందిన కౌలురైతు జీడిమడ్ల వీరారెడ్డి కౌలుకు తీసుకున్న కమతంలో వ్యవసాయ బావితో పాటు ఓ బోరుబావిసైతం ఉంది. ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం తగ్గడం, ఎండలు పెరగడంతో బోరు ఆగి ఆగి సన్నగా పోస్తోంది.
సీఎం రేవంతరెడ్డి కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మాని..మన రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ మునిసిపాలిటీలో ఇంటి పన్ను వసూళ్ల డ్రైవ్ ముమ్మరంగా కొన సాగుతోంది.
నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ మధ్య చిన్నపాటి ప్రమాదం జరిగింది. అయితే, ఆ తరువాత జరిగిన వాగ్వాదం మరో విషాదానికి దారి తీసింది.
వారం రోజుల క్రితం గుర్రంపోడు మండలంలోని ఓ గ్రామంలోని ఫారంలో 1,000 కోళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి. కోళ్లు చనిపోవడంతో సదరు పౌలీ్ట్ర రైతు ఆం దోళనకు గురయ్యాడు. ఆర్థికంగా నష్టపోయానని అత డు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
జిల్లాలోని ఏ ఒక్క ఆవాస ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తవద్దని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మరో నెల రోజుల్లో యాసంగి సీజన్ ధాన్యం దిగుబడి రానుండటంతో వీటి సేకరణకు అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నా రు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.