మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీ) పథకం కింద కూలీలకు రెండున్నర మాసాలుగా నిలిచిన కూలి డబ్బుల చెల్లింపులకు మోక్షం లభించింది. 15రోజులకు ఒకసారి కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. సుమారు రెండున్నర నెలలుగా జమ కాకపోవడంతో చేసిన కష్టం ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూశారు.
పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 12వ స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రజా ఉద్యమాలను బలహీన పరిచేందుకు ఈ-ఫ్యూచర్ సిటీ డ్రామాలు చేస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ఆరోపించారు.
కవిత పార్టీ పెట్టడం.. అది కూడా టీఆర్ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని.. కవిత తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు, శాస్త్రీయ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, వచ్చే నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది.
పాఠశాలలు తెరిచినరోజే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రానికి చేరవేసింది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లాకు 3,41,350 పుస్తకాలు అవసరం కాగా 2,48,770 పుస్తకాలు జిల్లాకు వచ్చాయి.
యాసంగి వరి కోతల వేళ డీజిల్ కొరత రైతులను వేధిస్తోం ది. వరి కోతలు చేపట్టే హార్వెస్టర్లు, రవాణాకు ఉపయోగించే ట్రాక్టర్లు, లారీలు, ట్రక్కులకు డీజిల్ లభ్యత లేకపోవడంతో పొలా లు, కల్లాల వద్ద ఉండాల్సిన రైతులు మండే ఎండల్లో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): యుద్ధంతో ప్రపంచ మాన వాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. టీఎస్ యూటీఎఫ్, సీఐటీయూ, నల్లగొండలోని ప్రోగ్రెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘ఇరాన్పై ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం - ప్రపంచ శాంతికి విఘాతం’ అనే అంశంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన సెమినార్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇజ్రాయిల్, అమెరికాలు ఇరాన్పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయ్యాయని అన్నారు.
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను నల్లగొండ టూటౌన పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అడిగినచోట బస్సు ఆపలేదనే ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్పై దాడిచేశాడు.