జిల్లావ్యాప్తంగా ఒక్కొ కౌన్సిలర్ టికెట్ కు నలుగురుకు పైగా పోటీ పడుతున్నా రు. అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ల లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. మాజీ కౌన్సిలర్లతోపాటు కొత్తగా పోటీ చేయాలని పలువురు తహతహలాడుతు న్నారు.
మునిసిపల్ ఎన్నికల త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఓవైపు అధికార యంత్రాంగం, మరోవైపు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాయి.
ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా చేపట్టిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జిల్లాల్లో జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీలపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది.
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని ప్రభుత్య పాఠశాలలకు కాంట్రాక్టర్లు తాళాలు వేశారు. మన ఊరు - మన బడి నిర్మాణ భవనానికి సంబంధించిన బిల్లులు రాక పోవడంతో కాంట్రాక్టర్లు ఈ చర్యలకు పాల్పడ్డారు.
లాక్పడెత్కు గురైన కర్ల రాజే ష్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థులు గెలిచే వార్డుల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా చైర్మన్ రేసులో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. వారు నివాసం ఉండే వార్డులో కాకుండా పక్క వార్డు నుంచి పోటీచేస్తే విజయావకాశాలపై ఆరాతీస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న వ్యవసా య కళాశాల భవనాల నిర్మాణానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఐదుగురు టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది.
సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నియంత్రణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.