మునిసిపల్ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. ఒకవైపు పగటివేళ ఇంటింటి ప్రచారాలు సాగిస్తూ, రాత్రికి పంపకాలు మొదలుపెట్టారు. గల్లీల్లో ఎక్కడికక్కడ దావత్లు, పార్టీలు ఊపందుకున్నాయి.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు 2026-28 సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ము గుస్తుందని, కొత్తకార్డులకోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులకు జారీ చేయనున్నట్లు తెలిపా రు.
మునిసిపల్ పోరు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు అగ్ని పరీక్షలా మారింది. ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరడంతో ఆయావార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, పట్టణ ముఖ్యనాయకులకంటే అసెంబ్లీ నియోజవర్గ అగ్రనాయకులే అలుపెరుగని వార్డు పర్యటన లు, పాదయాత్రలు, ప్రచారాలు సాగిస్తున్నారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాల నేతలు రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చేందుకు ఓవైపు ఉధృత ప్రచారం సాగిస్తున్న నేతలు మరోవైపు డివిజన్లు, వార్డుల్లో పరిస్థితులపై సర్వే చేయిస్తున్నారు.
:గ్రామీణ పాలనకు బలమైన ఆర్థిక పునాది వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా, కొత్త పాలకవర్గా లు కొలువుదీరాయి. దీంతో కేంద్రం 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది.
ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్ధి చేపట్టాల్సిన గురుతర బాధ్యత పురపాలక సంఘాల పాలకవర్గాలపై ఉంటుంది. అయితే సమస్యలను తీర్చే పాలకవర్గాలను ఎన్నుకునే బాధ్యత ప్రజల ది. కానీ, ప్రస్తుత ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు.
ఏడాది చివరికల్లా ఎయిమ్స్ నిర్మాణాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీబీనగర్లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆయన సందర్శించారు.
గ్రామీణ ప్రాంతంలో వలసలను నిర్మూలించేందుకు 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును వీబీజీరామ్జీగా మార్చింది.
మునిసిపల్ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులెవరో ఖరారయ్యారు. మంగళవారం నామినేష న్ల ఉపసంహరణ గడువు ముగిశాక, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఇక పూర్తిస్థాయిలో ప్రచార క్షేత్రంలోకి దిగనున్నారు.