వానాకాలం సీజన్ సాగుకు వ్యవసా య శాఖ సన్నద్ధమవుతోంది. యాసం గి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరులో ముగుస్తుండటంతో వచ్చే సీజన్కు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, స్వ యం సమృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం అమలుకు తాజాగా రాష్ట్రాన్ని సైతం ఎంపిక చేసింది. ఆర్థిక వనరుల పెంపునకు అవకాశం ఉన్న పంచాయతీల్లో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఆదాయాన్ని అర్జించి సమగ్ర గ్రామాభివృద్ధి సాధించాలనేది ఆత్మనిర్భర్ పంచాయత్ పథకం లక్ష్యం.
సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. వెంటనే బాలుడి తాత అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించాడు.
ఉపాధ్యాయులంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నారు. మండు వేసవి ఎండలో ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బడిబాట కార్యక్రమ షెడ్యూల్ను విడుదలచేసింది. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు జనగణన విధులు నిర్వహిస్తుండగా, బడిబాటలో ఎలా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
విద్యా విధానంలో భారీ మార్పుల్లో భాగంగా ఇంటర్మీడియట్ను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వాయిదా వేయడంతో యథావిధిగా ఇంటర్ కోర్సులు కొనసాగనున్నాయి. దీంతో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల లబ్ధిదారులు మృతిచెంది తే వారి పేరును జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. జాతీయ సామాజిక భద్రతా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద వృద్ధాప్య, వింతంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మిక, తదితర వర్గాలకు పెన్షన్లు అందిస్తోంది.