చౌటుప్పల్ మునిసిపాలిటీలోని ప్రతీ ఇంటికీ కృష్ణాజలాలు అందనున్నాయి.
చౌటుప్పల్ పట్టణం నడి బొడ్డున గల నాగుల కుంట జలకళను సంతరించుకుంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి.
వాతావరణ శాఖ రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలన్నారు.
దేశంలోనే అత్యుత్తమ వైద్య విద్య సంస్థగానే కాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు భూములు ఇచ్చిన రైతులు మాత్రం జీవనాఽధారం కోల్పోయి నిర్వాసితులయ్యారు.
రుతుపవనాలు మే నెలాఖరులోనే రాగా, వానాకాలం ముందస్తుగా మురిపించింది. ఆ తరువాత మోస్తరుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలతో వానాకాలం సాగుపనులు ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడింది.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సూచిస్తే(రెఫర్) ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిని సోమవారం పరిశీలించారు. వసతులను, వైద్య సేవలను, ఆస్పత్రి నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడారు.
పాడి రైతులకు మద ర్ డెయిరీ ఈ నెల 20లోగా ఆరు బిల్లులను చెల్లించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి హెచ్చరించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.