సిద్దిపేటలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.. అడ్డుకోబోయిన కూతురుపైనా దాడి చేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరానని తెలిపారు..
చలికాలంలో ఇంట్లో ఉంటే శరీరానికి సూర్యరశ్మి అందదని.. అందువల్ల పతంగి ఎగురవేయడం చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పండుగ వేళ.. పిల్లలు, పెద్దలు అంతా బయటకు వచ్చి సాయంత్రం వరకు పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి ఎండ తగలడంతో డి విటమిన్ అందుతుందని ఆయన వివరించారు.
చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మాంజా కారణంగా గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
భర్త చేసిన అప్పులను తీర్చేందుకు ఓ భార్య దొంగగా మారింది. గతంలో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళ.. అప్పులతో కూరుకుపోయిన భర్త బాధ చూడలేక చైన్ స్నాచింగ్కు పాల్పడింది. అయితే చివరకు ఆమెకు ఊహించని షాక్ తగిలింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ అన్ని ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
అధికారంలో ఉన్నామని.. పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూడవద్దంటూ పార్టీ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. ఈ ఎన్నికల్లో టికెట్ల కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఇబ్బంది పెట్టొద్దని కేడర్కు సూచించారు.
పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యంగ్యంగా అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రెండు పార్టీలు.. నష్టం చేస్తూనే ఉన్నాయన్నారు.
కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది 30వ తేదీన సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది.