Home » Telangana » Mahbubnagar
గద్వాలలో ఆర్డీఓగా పనిచేసిన రామ్చందర్నాయక్ నారాయణపేటలో లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను అధికారులు జయప్రదం చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకున్నాయని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో విడగొట్టే చర్యలకు పూనుకుంటున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మహబూబ్నగర్ డీఐఈవో(ఇంటర్మీడియట్ విద్య జిల్లా అధికారి)గా సి.రమణిని ని యమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఆమె బాధ్యతలు చేపట్టారు. రమణి యాదాద్రి భువనగిరి జి ల్లాలోని భవనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ, ఇక్కడికి వచ్చారు.
ప్రజా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అ న్నారు. ప్రమాద రహిత తెలంగాణ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రమాదాలు జరుగకుండా రవాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కౌంట్డౌన్ మొదలైంది. మే 1 నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ(వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్)గా మార్చనుంది. ఈ నేపథ్యంలో ఉపాఽధి హామీ పథకంలో పాత పనులు ఈనెలాఖరు వరకే చేసుకోవాల్సి ఉంటుంది.
నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా, నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు నుంచి చెంచులను మైదాన ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ క్రమంగా వివాదాస్పదం అవుతోంది.
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను చేపట్టిన విషయం తెలిసిందే.. ఈ సర్వేలో వచ్చిన వివరాలను ప్రభుత్వం క్రోడీకరించి బుధవారం జిల్లాలు, కులాలు, వర్గాల వారీగా వివరాలను వెల్లడించింది.