Share News

బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 24 , 2025 | 10:55 PM

తెలంగాణ భవన, ఇత ర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో అర్హులైన కార్మికులందరూ తమపే ర్లను నమోదు చేసుకొని బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బీమా పెంపు అవగాహన సదస్సు కరపత్రాలను విడుదల చేస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భవన, ఇత ర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో అర్హులైన కార్మికులందరూ తమపే ర్లను నమోదు చేసుకొని బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. సంక్షే మ మండలి బీమా పెంపు అవగాహ న సదస్సుకు సంబంధించిన కరపత్రా లు, గోడపత్రికను సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సంద ర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో సహజ మరణం పొందిన కార్మికులకు రూ.లక్ష బీమా అందుతుండగా ప్రస్తుతం రూ.2లక్షల బీమా డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాదవశాత్తు మరణించే వారి కుటుంబాలకు ప్ర భుత్వం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా బీమా పెంచడం జరిగిందన్నారు. సహజ మరణానికి సంబంధించి లేబర్‌ గుర్తింపు కార్డు, ఆధార్‌ ఒరిజినల్‌ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, నామిని ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాసు పుస్తకం కాపీ, ప్రమాద మరణానికి సంబంధించి అదనంగా ఎఫ్‌ ఐఆర్‌ కాపీ, పోస్టుమార్టం రిపోర్టును మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో సహాయ కార్మిక శాఖ అధికారి వేణుగోపాల్‌, సిబ్బంది అబ్రహం ఉన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 10:55 PM