Home » Telangana » Mahbubnagar
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావాలని బావా బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.
ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫుడ్ పాయిజన్ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
మ హబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవం కోసం సహకరించామని, ఆ కృతజ్ఞత కూడా లే కుండా తమ పార్టీ కార్పొరేటర్లను బ్లాక్మెయిల్ చే యడం దారుణమని మాజీమంత్రి వి శ్రీనివా్సగౌడ్ అన్నారు. ఇలాంటి రాజకీయాలకు భయపడబోమని చెప్పారు.
పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి 2024-2025 ఏడాది పెండింగ్ డబ్బులు రూ.65 లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని పది స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్ చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వకముందే కమీషన్లు, వాటాల వరకు మాటల తూ టాలు పేలుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో మేకల శివుడు ఇంటి ఆవరణలో ఏకంగా ఒకేసారి 12 జర్రిపోతు పాము పిల్లలు కనిపించి కలకలం రేపాయి.
మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి న రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సం ఘటన ఆదివారం ఉదయం మండల పరిధిలోని గుండె వాల్యా నాయక్ తండా గ్రామ పంచా యతీలో జరిగింది.
గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మె్ల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనతా ఆయనకే దక్కుతుందన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకత్వంపై ఫోకస్ పెట్టారు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దక్కక, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్న వారిని తనతో కలుపుకుని పోయేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.