పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్రంలోని రైతులందరికీ కలిపి రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు గూడు కట్టిస్తుందని తెలిపారు.
ఖమ్మం నగరంలోని గాంధీనగర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పచ్చని సంసారంలో వచ్చిన కుటుంబ కలహాలు ఇద్దరు అమాయక చిన్నారుల ప్రాణాలను బలితీసుకున్నాయి.
SIR పై అప్రమత్తంగా లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 3,02,800 ఓట్లు ఉంటే అందులో సగం ఓట్లు కూడా మ్యాపింగ్ కాలేదన్నారు.