Home » Telangana » Khammam
ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి రేవంత్ భద్రాచలానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం రాములవారిని దర్శించుకుంటారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో కిష్టారం పెట్రోల్ బంక్లో 5 వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని గుర్తు తెలియని వ్యక్తులు పది రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.
ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు.
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. నగరంలోని ఖానాపూరం హవేలీ స్టేషన్ పరిధిలో 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకెట్లుగా చేసి గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో నిందితులను రెడ్ హ్యాడెండ్గా పట్టుకున్నారు.
బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యతగా సీపీఐ(ఎంఎల్) పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు(Potu Ranga Rao) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని.. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని అన్నారు.