ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్లో కందులకు ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
పంటలకు యూరియా వాడటం వల్లే నష్టం కలుగుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యూరియా వాడకం క్రమంగా తగ్గించాలని సూచించారు.
ఖమ్మంలో పార్క్కు మహనీయుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నగర ప్రజలు సహకరిస్తే ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకు వస్తామన్నారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ దీవెనలతో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్ అండ్ కోకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మంలో ప్రపంచస్థాయి డిజైన్తో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు. ఖిల్లాకు రోప్ వే పనులు ప్రారంభమయ్యాయని.. జూన్ నాటికి మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.