Home » Telangana » Karimnagar
చొప్పదండి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆమె ఎమ్మెస్సీ బీఈడీ చేసిన విద్యావంతురాలు.. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
జమ్మికుంట/జమ్మికుంట రూరల్, ఫిబ్రవరి 16: (ఆంధ్రజ్యోతి): అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది.
హుజూరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రొంటాల సుహాసిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ బిజీగా ఉండేవారు..
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రెండురోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ప్రశాంతంగా జరిగింది.
జిల్లా క్రీడలు యువజన శాఖ, జిల్లా జూడో, రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో జిల్లా స్థాయి జూడో పోటీలను జిల్లా డీవైఎస్ఓ సురేష్ ప్రారంభించారు.
ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని అద్దె వాహనాల డ్రైవర్లకు పెరిగిన వేతన ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించాలని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలోని డ్రైవర్ల సంఘం డిమాండ్ చేసింది. మూడు నెలలుగా పెరిగిన వేతనాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు.
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పేచీ వీడడం లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కొద్ది రోజులుగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థులు ఎటూ తేలకపోవడంతో జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్క అభ్యర్థి తనను చైర్మన్ చేస్తే మిగతా సభ్యులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రామగుండంలో కొలువుదీరిన పాలకవర్గం ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎమ్మె ల్యే రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమకు మేయర్ పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. 34 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.