Home » Telangana » Karimnagar
జిల్లాలో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
యుఐడిఎఫ్ నిధులు రూ.88.60కోట్లతో నగరంలో నీటి సరఫరా మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుం టున్నట్లు రామగుండం మేయర్ మహాంకాళి స్వామి తెలిపారు. శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్తో ఆయన సమీక్షించారు.
ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పీఎస్వోలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని కరీంనగర్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆదేశించారు.
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను పరస్పర సహకారంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పిలుపునిచ్చారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు.
సింగ రేణి స్థలాలలో అక్రమంగా మసీదు, చర్చిలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శని వారం ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికా రులను ఆదేశించారు. శనివారం ఐడిఓసీ కార్యాలయం లో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్య లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకి పది రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటే, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అరుగాలం కష్టించి పండించిన వరి, మొక్కజొన్న కళ్లాల్లోనో లేకుంటే కొనుగోలు కేంద్రాల్లోనో ఉండడంతో అకాల వర్షాలు కురిస్తే చేతికి రాకుండా పోయే ప్రమాదముందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాలు, తరుగు పేరిట బస్తాకు నాలుగు కిలోల చొప్పున క్వింటాలుకు 8 నుంచి 10 కిలోలు అదనంగా జోకితేనే కొనుగోలుకు ముందుకు వస్తున్న తరుణంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
సమాజంలో వృద్ధులకు రక్షణ కల్పించేందుకు పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ పిల్లల నిర్లక్ష్యం, వారసుల ఆస్తి తగాదాలతో వేధింపులు ఆగడం లేదు. ఇంటా, బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ జీవిత చరమాంకాన్ని కన్నీటిమయంగా గడుపుతున్నారు.
వరి కోతలు పూర్తి కాగానే మిగిలిన వరి కొయ్యలను కాల్చడం రైతులకు ఆనవాయితీగా మారింది. వాటిని కాల్చడం వల్ల భూసారం దెబ్బతిన్నడమే గాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తెలిసినా కూడా రైతులు అదేపనిగా వరి కొయ్యలను కాలుస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల గాలికి, ఎండ తీవ్రతకు మంటలు అదుపులోకి రాక పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఎరువుల దుకాణాల వద్ద యూరియా కోసం చెప్పులు, పాసుబుక్కులు వరుసలో పెట్టడం, అర్ధరాత్రి నుంచి పడికాపులు కాయడం వంటి పరిస్థితులను తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్ నుంచి రైతులకు మొబైల్ యాప్ ద్వారా ఎరువులను రైతులకు విక్రయించే చర్యలకు పూనుకుంది. యాప్ వినియోగంలో రైతులకు మొదట్లో కొంత ఇబ్బందులు ఏర్పడిన తర్వాత యాప్ వినియోగించుకునే విధానం తెలుసుకున్నారు.