Home » Telangana » Karimnagar
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, కరపత్రాలు, ఫ్లెక్సీలు ఇతర ముద్రణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ధైర్యం గా ధైర్యంగా పోటీ చేయాలని, రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు.
సింగరేణి కార్మిక సం ఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎస్యూఎస్, ఏఐ ఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్జీ కేఎస్, ఐఎఫ్టీయూ ఏడు కార్మిక సంఘాల సమావేశం ఆదివారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో యూ నియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది.
జిల్లాలో నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు వ్యాపారులకు లైసెన్స్లు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 75మద్యం షాపులు ప్రారంభించను న్నారు. రామగుండం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు, వివిధ మండలాల్లో కొత్త షాపులు ఏర్పాటు కానున్నాయి.
రామగుండంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా ప్రజల అభిష్టం మేరకు విద్యుత్ కేంద్రం కట్టి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామగుండంలో 800మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపనకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం రామగుండం పట్టణానికి వచ్చిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
పంచాయతీ ఎన్నికలు పారదర్శ కంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణులతో కలిసి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 22 షాపులు దగ్ధమయ్యాయి.
పంచాయతీ ఎన్నికల పర్వంలో తొలి విడత నామినేషన్లుపూర్తయి మలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తరుణంలో గ్రామాలు రాజకీయాలతో వేడెక్కాయి. కొత్తగా సర్పంచలు కాదలచుకున్నవారు నూతనోత్సాహంతో కొనసాగుతుండగా.. అదే గ్రామాల్లో మాజీ సర్పంచలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన నామినేషన్ల గడువు శనివారం ముగిసింది. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. తొలి విడతలో 122 గ్రామ పంచాయతీలు, 1,172 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు రాత్రి వరకు 773 నామినేషన్లు రాగా వార్డులకు 2,243 వచ్చాయి.
పల్లె ఎన్నికలు జోరందుకున్నాయి. సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగిసి పోయింది. ఉపసంహారణలు, ఏకగ్రీవాల కోసం ఒకవైపు మంతనాలు జరుగుతుండగా మరోవైపు ప్రచారంలోకి అభ్య ర్థులు ఆడుగుపెడుతున్నారు.