Home » Telangana » Karimnagar
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 కెనాల్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్డీవో పులి మధుసూదన గౌడ్ పేర్కొన్నారు.
జిల్లాలో జరిగే ఇంటర్మీడి యెట్ పరీక్ష కేంద్రాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కోరారు.
మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని తాట్లవాయి, దావనపెల్లి గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు.
వేములవాడలోని రాజరాజే శ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతులు నిరసన దీక్ష చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అని బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు భూమల్ల అనీల్కుమార్ పేర్కొన్నారు.
తమపై విమర్శలు చేసే ముందు అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, ప్రతిసారీ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై విమర్శ లు చేయడం కాకుండా ముందు మీరు రెండున్నర ఏళ్లుగా కొత్త పని ఏం చేశారో ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారా వు డిమాండ్ చేశారు.
జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రదేశంలో లబ్ధిదారులకు అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించి, ఇక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అధికారులకు సూచించారు.
ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశిం చారు.
ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ను ఆదేశించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఒలం పిక్స్లో రాణించాలన్నది ప్రతి క్రీడాకారుడి లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్కు ప్రాతినిథ్యం వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.