Home » Telangana » Karimnagar
మూడు నెలలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న రేషన పంపిణీలో కార్డుదారులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నిధానంగా తీసుకుందామని ఇన్నాళ్లు జాప్యం చేసిన కార్డుదారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు నెలాఖరు నిర్ణీత గడువు ముగిసే సమయం సమీపిస్తుండడం.. మరోవైపు దుకాణాల్లో బియ్యం లేవని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులకు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోగులను దోచుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్వాహకులు రిఫరల్ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హత లేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు.
పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఇప్పుడు పెళ్లిళ్ల ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసం ముహుర్తాలకు నెలవు. కానీ వధువు ఎక్కడ..? అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఆరాట పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థుల డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి, రోజు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మంథనిలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేస్తోంది.
కరీంనగర్ రూరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): భూభారతి రీసర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీవో షర్మిల గ్రామస్తులకు సూచించారు.
గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పంచాయతీ అధి కారులతో గ్రామీణ పరిపాలనపై సమీక్ష నిర్వహిం చారు.
రామడుగు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు
లోక్ అదాలత్లతో ఇరువర్గాలకు సమ న్యాయం అందుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించారు.
నేరస్థులకు శిక్షలు పడడంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారుల పాత్ర కీలకమని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. శనివారం కమిషనరేట్లో సమీక్ష సమా వేశంలో పలు సూచనలు చేశారు. కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు అంశంలో అధికారులు నిబంధనలు పాటించాలన్నారు.
పాత రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో అన్ని గ్రామాలకు ఒకే పేరు ముద్రించారు. మండలంలో 15వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతగా శనివారం 22 గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.