Home » Telangana » Karimnagar
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టాల్లు ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సర్పంచ్లకు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచిం చారు. పెద్దబొంకూరు మథర్థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు.
నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని వ్యాపార, వాణిజ్య కూడలి అయిన శివాజీనగర్, మేదరిబస్తీ, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్లోని కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారు. వాహనాలను దుకాణాల ఎదుట పార్క్ చేస్తున్నా మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఆయిల్పామ్ సాగు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నాలుగేళ్లలో 44,500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
మున్సిపల్ ఎన్నికల పుణ్యామా అని... వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోటీ కోసం చేసిన ఖర్చు తడిసి మోపడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా..? అని ఓటమి చెందిన అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే..తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా..గెలువకపోతిమి. ఉన్న ఆస్థులు, బంగారం పాయే..అప్పుల కుప్పాయే..అంటూ చాలా కుటుంబాలు కుమిలి పోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది.
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 18 (ఆంఽధ్రజ్యోతి): ధర్మారం ఎక్స్రోడ్లోని స్టోన్ క్రషర్లతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని బుఽధవారం కుర్మపల్లి గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు.
కళ్యాణ్నగర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వాతావర ణంలో మార్పుతో వ్యాధులు పెరిగిపోవడంతో గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ఆసుపత్రి రోగులతో కిటకిటలాడు తోంది.
జ్యోతినగర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుగా సవరించాలని ఎన్టీపీసీ టీటీఎస్లోని కేంద్ర అసిస్టెంట్ లేబర్ కమిషనర్కు బుధవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ తర పున వినతిపత్రం అందించారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్ర జ్యోతి): ఇంటర్మీడియట్ అనేది విద్యార్థి దశలో చాలాకీలకమైనదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.