Home » Telangana » Karimnagar
రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణశ్రీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
ఎయిడ్స్పై ప్రజల్లో విద్యార్థులు సరైన అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి నుంచి అయ్యప్ప స్వామి ఆలయం, సిరి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, ఇన్స్పైర్ అవార్డ్ మనాక్ జంట ఎగ్జిబిషన్లు ఎన్టీపీసీ ఉన్నత పాఠశాలలో ఈనెల 2, 3, 4 తేదీల్లో జరగనున్నాయి. సోమవా రం జిల్లా విద్యాధికారి శారద ఏర్పాట్లను పరిశీలించారు.
పాఠశాలల్లో విద్యా ర్థులను నాలుగు హౌజ్ల కింద విభజిస్తే వారికి మేలు జరుగుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గ్రంథాలయం సందర్శించారు.
తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొదటి విడతలో ఒక సర్పంచ్, మూడు వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారు.
మండలంలో గంజాయిని సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్లోని తిరుమల హోమ్స్ ఏరియాలో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నారు. పోలీసులకు సమాచారం వచ్చింది.
అక్రమ ఇసుక రవాణాకు తెర తీసింది బీఆర్ఎస్ పార్టీనే అని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఇసుక క్వారీలే లేవని, బీఆరెస్ ప్రభుత్వ హయాంలో నిత్యం వందలాది లారీలతో ఇసుకను తరలించారని విమర్శించారు.
కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు.
రాష్ట్రంలో క్రీడాకారులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు.