Home » Telangana » Karimnagar
వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది.
కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అధికారులకు ఆదేశించారు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్జయంతి అధికారులను ఆదేశించారు.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్ పర్వం ముగియడంతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,194 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను కరీంనగర్లోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్రూంలలో భద్రపరిచారు.
చొప్పదండిలో ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిధులు లేక పనులు నిలిచిపోయినట్లు సమాచారం. ఏళ్లు గడిచిన ఫైర్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తి కాకపోగా చొప్పదండి మున్సిపల్ కార్యాలయ భవనంలో తాత్కాలికంగా కొనసాగుతోంది. నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ను ఉండాలని 2017 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి పలు చోట్ల ధాన్యం తడిసిందని, మామిడి కాయలు నేలరాలాయని, పిడుగు పాటుతో ఆవులు, గేదెలు మృతి చెందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ రణభేరీ మోగించింది. ఆరు గ్యారంటీల అమలుపై వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ నేతలంతా తమ తమ ప్రాంతాల్లో వడ్ల కల్లాలను సందర్శించనున్నారు.
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి జన్మదిన పురస్కరించుకొని బుధవారం ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకు న్నారు.
నేత్ర, అవయవదానాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అన్నారు.
సింగరేణి ట్రేడ్యూనియన్ టీబీజీకేఎస్ కమిటీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కార్మికులు, ప్రజలు గుర్తించాల ని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.