Home » Telangana » Karimnagar
ఇల్లందకుంట, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాల యంలో శుక్రవారం హుండీలను లెక్కించగా రూ.20,39,551 సమకూరినట్లు ఈవో సుధాకర్ తెలిపారు.
కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ అమలుపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మట్టి మాఫియా కొండలు, గుట్టలను కొల్లగొడుతూ అక్రమంగా మట్టిని జోరుగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తమ కళ్లెదుట నుంచి మట్టి లారీలు వెళుతున్నా కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు.
విద్యుత్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. శుక్రవారం రాఘవాపూర్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఆర్టిజన్స్ చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీ భావం ప్రకటించారు.
రోజు రోజుకు భానుడి ప్రతాపం పెరిగిపోతున్నది. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. శుక్రవారం గరిష్ట 39.2 డిగ్రీలు, కనిష్ట 23.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఉదయం 7గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, దేవుడు జన్మనిస్తే, డాక్టర్లు ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం నంది మేడారంలో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ కో అప్షన్ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేశారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అంగన్వాడీ కేంద్రాల్లో కొంతకాలంగా రికార్డులన్నీ ఆన్లైన్ యాప్ల ద్వారా పనితీరును సులభతరం చేశారు. అంగన్వాడీ టీచర్లు ప్రతిరోజు విధిగా యాప్ల ద్వారా వివరాలు నమోదు చేస్తారు.
జగిత్యాల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.