Home » Telangana » Karimnagar
బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.
రామగుండానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వ్యాపార, విద్య, వైద్య పరంగా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని రామగుండంలో ఇక కూల్చివేతలు ఉండబోవని కట్టడాలే ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ పేర్కొన్నారు.
క్రీడాకారులందరూ మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.
ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరిగా మారిందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎకో పార్క్ రోడ్డులోని ఆరోగ్యపథ్ వద్ద ఆరోగ్య మేళాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ ప్రారంభించగా, డీఎంఎస్ అధ్యక్షులు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన కైవసం చేసుకోవడాన్ని అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
మహిళలకు రేవంత్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంతరావు అన్నారు.
గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే సిరిసిల్ల ప్రాంతంలోని డైయింగ్, సైజిం గ్, వార్పిన్ పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయ ని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు.
కులం, మతం కూడు పెట్టదు.. మనిషి సేవాగుణం చూసి ఓటు వేయాలని, ఏ పార్టీ గెలిస్తే సిరిసిల్ల బాగుపడుతుంది.. కడుపు నింపే పనులు చేస్తుందో ఆలో చించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నా రు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధుల కు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
కోల్సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఈనెల11న జరిగే కార్పొరేషన్ ఎన్ని కలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పెద్దపల్లి డీసీపీ బూక్య రాంరెడ్డి నాయక్ సూచించారు.