Home » Telangana » Karimnagar
గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. గట్టేపల్లిలో మండల న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు
మండలంలోని రంగాపూర్ పరిధిలోని వీఎస్ఆర్ ఇటుక బట్టీల్లో సీనియర్ సివిల్ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్ సెల్ అఽఽథారిటి, హైదరబాద్కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి భవానితోపాటు తహసీల్దార్ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సజిదా పర్వీన్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యక్తులు సోలార్ ప్లాంట్ను వినియోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆన్నారు.
వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. టౌన్-2 సబ్డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో వినియోగదారుల సమస్యల వేదిక (లోకల్ కోర్టు)ను శనివారం నిర్వహించారు.
యాసంగి సీజన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణకు ప్రైవేట్ వలంటీర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
సుభాష్నగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు.
తిమ్మాపూర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్లు పంచాయతీ రాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే అన్నారు.
సుభాష్నగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 20 (ఆంద్రజ్యోతి): యాసంగి వరిలో తెగుళ్లు సోకి పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.