Home » Telangana » Karimnagar
మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు పేర్కొన్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపడంతోపాటు భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో భూముల రీ సర్వేలను ప్రణాళిక ప్రకారం చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అదేశించారు.
మండలంలో సర్ (ఎస్ఐఆర్) కార్య క్రమాన్ని నిర్ణీత గడువులోగా వందశాతం పూర్తి చేయాలని డీఆర్వో రాజశ్రీ అధికారులను ఆదేశించారు.
మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ హెచ్చరించారు.
పెద్దపల్లి పట్టణం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. పట్టణం ప్రారంభం రంగంపల్లి నుంచి మంథని ఫ్లైవోవర్ వరకు ప్రయాణించడం గగనంగా మారింది. పలు యూటర్న్లు, సిగ్నల్స్ ఉన్నప్పటికీ రాజీవ్ రహదారి పట్టణం నుంచే ఉండడంతో గందరగోళంగా తయారైంది
వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు భరోసా పథకం కింద జిల్లాకు చెందిన రైతులందరికీ తొమ్మిది రోజుల్లో ముందు ప్రకటించిన విధంగానే వారివారి ఖాతాల్లో ఎకరాకు 6వేల రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని అందించారు.
వానాకాలం పంట సీజన్ మొదలై నలభై రోజులు దాటినా వరుణుడు కరుణించకపోవడంతో జిల్లా రైతుల్లో అలజడి మొదలైంది. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. ప్రధానపంటల విత్తనాలు నేలను తాకలేదు. భూగర్భజలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతులు అగచాట్లు పడుతున్నాడు.
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రి యకు గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 24వ తేదీలోగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో కలెక్టర్ రం గంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్ను వేగ వంతం చేసేందుకు బీఎల్ఓలతో పాటు మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బందిని పురమాయిస్తున్నారు.
అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తుంటే.. వానమ్మకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విరామ దశ (మాన్సూన్ బ్రేక్) ప్రారంభమైంది. వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని రోజులపాటు హఠాత్తుగా వర్షాలు పడకుండా ఆగిపోవడాన్ని మాన్సూన్ బ్రేక్గా భావిస్తారు. రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు కదిలినప్పుడు ఈ విరామం ఏర్పడి మినీ సమ్మర్గా మారుతుంది.