• Home » Telangana » Karimnagar

కరీంనగర్

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

జనగామలో ఈనెల 28, 29న నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు అన్నారు.

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్‌ అహ్మద్‌, ఐ కృష్ణ ఆరోపించారు.

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.

నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే...

నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే...

రామగుండం కార్పొరేషన్‌లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్‌పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.

ప్రారంభమైన సమ్మక్క - సారలమ్మ మొక్కులు

ప్రారంభమైన సమ్మక్క - సారలమ్మ మొక్కులు

రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్‌ బెల్ట్‌లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి.

Dog Attack: పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు

Dog Attack: పిచ్చికుక్క దాడి.. 20 మంది భక్తులకు గాయాలు

రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు.

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ వివాదం

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ వివాదం

కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడం వివాదంగా మారుతోంది. వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మానకొండూర్‌ శాసనసభ్యుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ఒకటిరెండు సార్లు ఉద్దేశపూర్వకంగానే తనపై వివక్ష చూపిస్తున్నారని కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులు ఆగ్రహాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన ప్రొటోకాల్‌ పాటించని వారిపై చర్యకు డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.

లెక్కలు తేల్చాల్సిందే..

లెక్కలు తేల్చాల్సిందే..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్‌ వేసిన నాటి నుంచి పోలింగ్‌ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. లేదంటే ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు అంటున్నారు.

ఏడాదిన్నరగా.. ఎదురుచూపులు

ఏడాదిన్నరగా.. ఎదురుచూపులు

మన ఊరు.. మన బడిలో భాగంగా జిల్లాలోని ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఒక డైనింగ్‌ హాల్‌, అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గదిని నిర్మించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తనకు రావాల్సిన సుమారు 12లక్షల రూపాయల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినా కూడా ఒక్క రూపాయి బిల్లు రాలేదు. ఈ విధంగా ఆయనే కాదు చాలా గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.

యూరియా బేఫికర్‌..

యూరియా బేఫికర్‌..

యాసంగిలో రైతులకు యూరియా తిప్పలు తప్పించే దిశగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. వానాకాలం సీజన్లో ఎరువుల కోసం రైతులు గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారు. చెప్పులు, పాసుబుక్కులు క్యూలైన్లలో పెట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి